బ్యాంకింగ్ సేవలు బంద్ కానున్నాయి. ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా,  ఏప్రిల్ 15న గుడ్ ఫ్రై సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఇక శనివారం ఏప్రిల్ 16న ఒక్కరోజు బ్యాంకులు తెరుచుకోనుండగా.. మళ్ళీ ఆదివారం సెలవు ఉంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతితో పాటు ఇదే రోజు మహావీర్ జయంతి, వైశాఖి, తమిళనాడు న్యూ ఇయర్, బిజు ఫెస్టివల్ కూడా వస్తున్నాయి.
 
									
										
								
																	
	 
	దీంతో మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 14న బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది. అలాగే ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడేతో పాటు బెంగాలీ న్యూ ఇయర్, హిమాచల్ డే వస్తున్నాయి. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	వినియోగదారులు ఈ తేదీలను గుర్తుపెట్టుకొని అస్సాం మినహా అత్యవసర బ్యాంకు పనులు ఉంటే శనివారం చేసుకోవాల్సి ఉండగా.. మిగతా సాధారణ పనులను సోమవారం అనంతరం వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే నాలుగు రోజులలో శనివారం ఒక్కరోజే వర్కింగ్ డే అంటే సాధారణంగానే కస్టమర్ల రద్దీ ఎక్కువ ఉంటుంది.