Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

ఢిల్లీ జహంగీర్ పుర‌లో 144 సెక్షన్ అమలు

Advertiesment
police
, ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (16:37 IST)
దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో ఢిల్లీలోని జహంగీర్ పుర‌లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించారు. 
 
కాగా హనుమాన్ శోభాయాత్ర సమయంలో రెండువర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు. అలాగే, ఈ అల్లర్లలో గాయపడిన తొమ్మిది మందిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ శోభాయాత్ర మసీదు వద్దకు చేరుకోగానే చిన్నపాటి గొడవ మొదలై ఆ తర్వాత పెద్దదిగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అయితే, వదంతులు నమ్మొద్దని ప్రజలందరూ సంయమనం పాటించాలని పోలీసులు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే భక్తులకు శుభవార్త : మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి