Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం తల్లీకుమార్తెను హత్య చేసిన బంధువు

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (14:00 IST)
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. ఆస్తి వివాదంలో తల్లీకుమార్తెను సమీప బంధువు హత్య చేశాడు. ఇంట్లో ఉన్న తల్లీ కుమార్తెను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. 
 
శనివారం జరిగిన ఈ దారుణ హత్య కేసుల వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా నాగార్జున నగర్‌లోని ఇంట్లో పద్మావతి, ప్రత్యూష  అనే ఇద్దరు తల్లీకుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో సమీప బంధువు శ్రీనివాస్‌ రావు ఇంట్లోకి వచ్చి ఇద్దరిపై విచాక్షణారహితంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. 
 
రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ.. కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూ యువతి తన సోదరుడికి ఫోన్‌ చేసి అప్రమత్తం చేసింది. అవే ఆమె చివరి మాటలయ్యాయి. ఇరుగు పొరుగు వాళ్లు అక్కడికెళ్లి చూసేసరికి.. తల్లీకూతుళ్లు చనిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అందిర్నీ షాక్‌కు గురిచేసింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఆస్తి వివాదమే ఈ జంట హత్యలకు కారణంగా ఉందని పోలీసులు వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments