Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ పరిచయం : పెళ్లి పేరుతో రూ.కోటి మోసం

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (13:40 IST)
ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్ జరిగే పరిచయాలు చివరకు విషాదాంతంగా ముగుస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ టెక్కీ నుంచి ఓ మహిళ ఏకంగా రూ.కోటి మేరకు దోచుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యర్రగడ్డ దాసు, జ్యోతి అనే దంపతులు కళ్యాణి శ్రీ పేరుతో ఓ ఫేస్‌బుక్ ఖాతాను ప్రారంభించి, అందుబాటులోకి వచ్చిన వారితో చాటింగ్ చేయసాగారు. అలా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు వీరికి పరిచయమయ్యారు. 
 
అతనితో జ్యోతి యేడాదిన్నరపాటు ప్రేమాయణం కొనసాగించింది. పెళ్లి చేసుకుంటానని దాసును జ్యోతి నమ్మించింది. చేతి ఖర్చుల కోసం దశల వారీగా రూ.కోటి వరకు తీసుకుంది. ఆ తర్వాత ఫేస్‌బుక్ ఖాతా డీయాక్టివేట్ అయింది. 
 
దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న టెక్కీ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేస్‌బుక్ ఖాతా ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వారిగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments