Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ పరిచయం : పెళ్లి పేరుతో రూ.కోటి మోసం

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (13:40 IST)
ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్ జరిగే పరిచయాలు చివరకు విషాదాంతంగా ముగుస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ టెక్కీ నుంచి ఓ మహిళ ఏకంగా రూ.కోటి మేరకు దోచుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యర్రగడ్డ దాసు, జ్యోతి అనే దంపతులు కళ్యాణి శ్రీ పేరుతో ఓ ఫేస్‌బుక్ ఖాతాను ప్రారంభించి, అందుబాటులోకి వచ్చిన వారితో చాటింగ్ చేయసాగారు. అలా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు వీరికి పరిచయమయ్యారు. 
 
అతనితో జ్యోతి యేడాదిన్నరపాటు ప్రేమాయణం కొనసాగించింది. పెళ్లి చేసుకుంటానని దాసును జ్యోతి నమ్మించింది. చేతి ఖర్చుల కోసం దశల వారీగా రూ.కోటి వరకు తీసుకుంది. ఆ తర్వాత ఫేస్‌బుక్ ఖాతా డీయాక్టివేట్ అయింది. 
 
దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న టెక్కీ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేస్‌బుక్ ఖాతా ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వారిగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

Ustad: పవన్ కళ్యాణ్ చే ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments