Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీటిలో కార్తీక దీపాలు వ‌ద‌ల‌బోయి... ప్రాణాలు వ‌దిలిన దంప‌తులు

నీటిలో కార్తీక దీపాలు వ‌ద‌ల‌బోయి... ప్రాణాలు వ‌దిలిన దంప‌తులు
విజ‌య‌వాడ‌ , శనివారం, 20 నవంబరు 2021 (10:18 IST)
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కాల్వలో దీపాలు వదిలేందుకు వెళ్లిన దంపతులు త‌మ నిండు ప్రాణాల‌ను వ‌దిలారు. కాలువ‌లో దీపాలు వ‌దులుతూ ప్ర‌మాద‌వ‌శాత్తు జారిప‌డి అందులో పడి మృతి చెందారు. కర్నూలులో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. నగరంలోని అబ్బాస్ నగర్‌కు చెందిన రాఘవేంద్రప్రసాద్ (44), ఇందిర (41) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని రాఘవేంద్రప్రసాద్ దంపతులు తెల్లవారుజామున 5 గంటలకు వినాయక్ ఘాట్ వద్ద కేసీ కాల్వ పక్కనే ఉన్న గుడికి వెళ్లారు.
 
 
పూజల అనంతరం కాల్వలో దీపం వదులుతూ, ప్రమాదవశాత్తు ఇందిర అందులో పడిపోయారు. ఆమెను రక్షించే క్రమంలో భర్త రాఘవేంద్రప్రసాద్ కూడా కాల్వలో పడిపోయారు. అప్రమత్తమైన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో వారు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జహారాపురం వద్ద వారి మృత దేహాలను గుర్తించారు. కార్తీక మాసంలో జ‌రిగిన ఈ దంప‌తుల విషాదాంతం అంద‌రినీ క‌లిచివేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్సీ కరీమున్నీసా ఆకస్మిక మృతి...నిన్న అసెంబ్లీకి వ‌చ్చి...