Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లాలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన భవనం

చిత్తూరు జిల్లాలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన భవనం
, శుక్రవారం, 19 నవంబరు 2021 (15:08 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అపారనష్టం వాటిల్లేలా కనిపిస్తోది. మరోవైపు, లక్షలాది మంది బాధితులు వరద నీటిలో ఉన్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదిలావుంటే, చిత్తూరు జిల్లాలో వరద నీరు ఉధృతికి ఓ భవనం కొట్టుకునిపోయింది. 
 
ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని తిరుచానూరులో 2 అంతస్తుల భవనం నదిలో కొట్టుకునిపోయింది. ఈ భవనం కూలిపోతున్న దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
మరోవైపు, తిరుమల గిరులతో పాటు.. తిరుపతి పట్టణంలో జోరు వర్షం కురుస్తుండటంతో తిరుపతి పట్టణం నీట మునిగిపోయింది. దీంతో తిరుపతి పట్టణం ఇపుడు కళావిహీనంగా కనిపిస్తుంది. అనేక మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి చేరుకుని వరద సహాయక చర్యలను చేపట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లే, మూడు రాజ‌ధానుల‌ను ర‌ద్దు చేయండి