Webdunia - Bharat's app for daily news and videos

Install App

టి.స్పీకర్‌తో కేసీఆర్ భేటీ: చంద్రబాబుతో ఆనం భేటీ

Webdunia
శనివారం, 16 ఆగస్టు 2014 (14:27 IST)
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారితో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సమావేశమయ్యారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీలో ఇరు రాష్ట్రాల నేతలకు ఛాంబర్ల కేటాయింపుతో పాటు బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
 
ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుతో నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి సమావేశమయ్యారు. లేక్ వ్యూ అతిథి గృహంలో కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలసి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆనం సోదరులు ఎప్పుడైనా టీడీపీలో చేరే అవకాశం ఉందంటూ వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా ఏపీ, టీఎస్ స్పీకర్లకు గవర్నర్ నరసింహన్ హితబోధ చేశారు. పెద్దవాడ్ని చెబుతున్నా.. స్పీకర్లిద్దరూ కలిసి పనిచేయండయ్యా! అన్నారు. స్పీకర్లు ఇద్దరూ తనకు రెండు కళ్ల వంటివారని, రెండు కళ్లూ పనిచేస్తేనే దృష్టి బాగుంటుదని నరసింహన్ చెప్పారు. 
 
మీరిద్దరూ కలిసి పనిచేయాలని నా కోరిక, పెద్దవాడిని చెబుతున్నా, వినండి అని ఆయన రెండు రాష్ట్రాల స్పీకర్లకు హితబోధ చేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నిర్వహించిన ‘ఎట్‌ హోం' అల్పాహార విందు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు శివప్రసాదరావు, మధుసూధనాచారి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments