Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించండి : ఏపీ సర్కారుకు గవర్నర్ ఆదేశం

Webdunia
బుధవారం, 22 జులై 2020 (13:59 IST)
నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన న్యాయపోరాటంలో విజయం సాధించారు. ఎట్టకేలకు ఆయన్ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నియమించాలంటూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులుకానున్నారు. 
 
కాగా, ఎస్ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డను తొలగించేందుకు ఏపీ సర్కారు కుట్ర పూరితంగా ఆలోచన చేసి.. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇందులో ఎస్ఈసీ పదవీకాలాన్ని మూడేళ్ళకు కుదించింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ అధికారి అయిపోయారు. ఆయన స్థానంలో కొత్తగా తమిళనాడు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి కనకరాజ్‌ను ఎస్ఈసీగా నియమించగా, ఆయన కూడా ఆగమేఘాలపై పదవీ బాధ్యతలు చేపట్టారు. 
 
అయితే, రమేష్ కుమార్ న్యాయపోరాటం చేశారు. ఇందులో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో విజయం సాధించారు. ఏపీ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో హైకోర్టు సూచన మేరకు ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశమై వినతి పత్రం కూడా సమర్పించారు.
 
ఈ నేపథ్యంలో బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను నియమించాలని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments