Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా

Webdunia
బుధవారం, 22 జులై 2020 (13:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ఈ రాష్ట్రంలో కొత్త పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్నాయి. ఈ కేసుల నమోదుతో పాటు.. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న టెస్టులపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలన్నీ ఆ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా వైరస్ సోకింది. 
 
మంగళవారం వరకు ఆయన హోం ఐసొలేషన్‌లోనే ఉన్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఆయన భార్య, కుమారుడు, పనిమనిషికి కూడా కరోనా సోకింది.
 
కాగా, తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. ఇలాంటి వారిలో మాజీ ఎంపీ, వృద్ధ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఉన్నారు. అలాగే, అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments