Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా

Webdunia
బుధవారం, 22 జులై 2020 (13:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ఈ రాష్ట్రంలో కొత్త పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్నాయి. ఈ కేసుల నమోదుతో పాటు.. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న టెస్టులపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలన్నీ ఆ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా వైరస్ సోకింది. 
 
మంగళవారం వరకు ఆయన హోం ఐసొలేషన్‌లోనే ఉన్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఆయన భార్య, కుమారుడు, పనిమనిషికి కూడా కరోనా సోకింది.
 
కాగా, తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. ఇలాంటి వారిలో మాజీ ఎంపీ, వృద్ధ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఉన్నారు. అలాగే, అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments