Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో బయటపడిన బంగారు నాణాలు

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (07:03 IST)
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానం ఘంటామఠం పునర్‌ నిర్మాణ పనుల్లో మరోసారి నాణేలు బయటపడ్డాయి. ఆదివారం నిర్మాణ పనులు చేస్తుండగా ఒక పెట్టెలో 15 బంగారు నాణేలు, 1 బంగారు ఉంగరం, 17 వెండి నాణేలు వెలుగుచూశాయి.
 
సమాచారం అందుకున్న ఆలయ ఈవో కె.ఎస్‌. రామారావు, తహసీల్దార్‌ రాజేంద్రసింగ్‌, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకున్నారు. అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.

ఘంటామఠం దక్షిణ భాగంలో ఉన్న గుండంలో ఊట వచ్చే ప్రదేశంలో ఇవి బయట పడ్డాయి. బంగారు నాణేలు 1880-1911 కాలానికి సంబంధిచినవని, వెండి నాణేలు 1885-1913 కాలానికి చెందినవని ఆలయ అధికారులు గుర్తించారు.

వీటితోపాటు 1892 నాటి మరో వెండి నాణెం కూడా లభించింది. విషయం తెలుసుకున్న దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు అధికారులతో కలిసి ఘంటామఠానికి చేరుకుని పురాతన నాణేలను పరిశీలించారు. అధికారుల సమక్షంలో వీటి వివరాలు నమోదు చేశారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments