Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం
, మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (23:01 IST)
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌ మండలం ఈగలపెంట సమీపంలో మూల మలుపు వద్ద రక్షణ గోడను వ్యాను ఢీకొని 20 అడుగుల లోయలో పడిపోయింది.

ఘటన జరిగిన సమయంలో అందులో 9 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

క్షతగాత్రులను ఈగలపెంట జెన్‌కో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌ దూల్‌పేటకు చెందిన కొంతమంది భక్తులు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి ఈగలపెంట ఎస్సై పోచయ్య చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ఆర్ సీపీ పాలనలో రైతులకు అన్యాయం జరగదు: మంత్రి మేకపాటి