Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యేలు గిరిజన బిడ్డలా ? రెడ్లకు బినామీలా?: గిడ్డి ఈశ్వరి

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (20:28 IST)
ప్రతిపక్షంలో  ఉన్నపుడు  బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమని చెప్పిన వైసీపీ  నేడు అధికారంలోకి వచ్చాక లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు జరుపుతూ  గిరిజన సంపదను దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు గిడ్డి ద్వజమెత్తారు.

మంగళవారం నాడు జూమ్ యాప్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ...వైసీపీ నేతలు లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వుతున్నారు, తూర్పుగోదావరి జిల్లా, విశాక జిల్లాకు మద్యలో సరుగుడు పంచాయితీ లో  వైసీపీ నేతల ఆద్వర్యంలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాల్ని టీడీపీ గిరిజన నేతలం వెలికితీశాం. 

దీనిపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ఉపేంద్ర యాదవ్ గారికి లేఖ రాస్తున్నాం. గతంలో సుప్రీం కోర్టు సమతా తీర్పులో ఏజెన్సీ ఏరియాల్లో మైనింగ్ తవ్వకాలు జరపొద్దని చెప్పింది. కానీ ఆ తీర్పుకు తూట్లు పొడిచేలా నేటి వైసీపీ ప్రభుత్వం  బాక్సైట్ తవ్వకాలు జరుపుతోంది. 

గిరిజన ప్రాంతాల్లో ఏ గ్రామానికైనా  రోడ్లు వేయాలంటే పారెస్ట్ క్లియరెన్స్ తప్పని సరి. కానీ బాక్సైట్ తవ్వేందుకు ఈ ప్రాంతంలో 14 కిలీమీటర్ల రోడ్డు ఎలా వేశారో  ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో 14 కిలీమీటర్లమేర 30 నుంచి  40 అడుగుల రోడ్డును మహాత్మగాంధీ ఉపాధిహామీ పధకం నిధులతో  యంత్రాలతో రోడ్డు వేసిని ఘనత వైసీపీకే దక్కుతుంది. 

బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న టీడీపీ నేతలపై కేసులు పెడతామని స్ధానిక వైసీపీ ఎమ్మెల్యేలు  బెదిరిస్తున్నారు. వారు గిరిజన బిడ్డలా? లేక రెడ్డి  బ్రదర్స్ కి బినామీలా? సమాధానం చెప్పాలి. గిరిజనులకు అన్యాయం చేస్తే గిరిజన ఆగ్రహానికి గురి కాక తప్పదు.

ఎప్పటికైనా గిరిజన సంపదను గిరిజనులంతా ఏకమై కాపాడుకుంటాం,  ఈ బాక్సైట్ తవ్వకాలను వెంటనే ఆపాలి లేకపోతే గిరిజనులంతా ఏకమై బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతున్న వారికి తగిన రీతిలో బుద్ది చెపుతామని ఆమె ‍హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments