Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదర్శ స్మారకాలుగా ఏపీలోని 3 చారిత్రక కట్టడాలు: కిషన్ రెడ్డి

ఆదర్శ స్మారకాలుగా ఏపీలోని 3 చారిత్రక కట్టడాలు: కిషన్ రెడ్డి
, మంగళవారం, 20 జులై 2021 (20:13 IST)
ఏపీలోని పలు చారిత్రక నిర్మాణాలకు విశిష్ట గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని 3 చారిత్రక కట్టడాలను ఆదర్శ స్మారకాలుగా గుర్తించినట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ఆదర్శ స్మారకాల జాబితాలో చేర్చినట్టు తెలిపారు.

ఈ ఆదర్శ స్మారకాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వీటిలో వై-ఫై ఇంటర్నెట్ సౌకర్యం, ఎగ్జిబిషన్, లైటింగ్ ప్రదర్శనలు, కెఫే వంటి ఏర్పాట్లు చేస్తామని కిషన్ రెడ్డి వివరించారు. ఇక వారసత్వ కట్టడాల దత్తత పథకంలో కడప జిల్లా గండికోటకు స్థానం కల్పించినట్టు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పది లక్షల భోజనాలను అందించేందుకు సంగీతా మొబైల్స్‌తో చేతులు కలిపిన ఫీడింగ్‌ ఇండియా బై జొమాటో