Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి చేసుకుంటానని నాలుగు నెలలు సహజీవనం, కట్నం అధికంగా వస్తోందనీ?

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (19:35 IST)
పెద్దలను తీసుకుని పెళ్ళి చూపులకు వచ్చాడు. అమ్మాయి నచ్చిందంటూ పెళ్ళికి ఒకే అన్నాడు. అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను బెంగుళూరుకు తీసుకెళ్ళాడు. నాలుగు నెలలు సహజీవనం చేశాడు. ఆ తరువాత యువతిని ఇంటికి పంపించేశాడు. మంచి ముహూర్తం చూసుకుని పెళ్ళి చేసుకుందామని చెప్పాడు. అయితే ఆ తరువాత కట్నం ఎక్కువ వస్తుందని ఆశపడ్డాడు. ఇంకేముంది ఆ యువతికి హ్యాండిచ్చాడు. లబోదిబోమంటూ ఆ యువతి రోడ్డెక్కింది.
 
పీలేరు మండలం రేగళ్ళు పంచాయతీ నగరి గ్రామంలో రేగళ్ళు గ్రామానికి చెందిన మణికంఠ అనే యువకుడు తిరుపతి కొర్లగుంటలో ఉంటున్న ఓ యువతిని నాలుగు నెలల క్రితం పెళ్ళి చూపులు చూశాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఆమెను పెళ్ళిచేసుకుంటానని బెంగుళూరుకు తీసుకెళ్ళాడు.
 
కొన్నిరోజుల పాటు అక్కడే సహజీవనం చేశాడు. యువతి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబం కావడంతో ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే ప్రస్తుతం తనతో పాటు బెంగుళూరులో పనిచేసే మరొక యువతిని పెళ్ళాడేందుకు సిద్థమయ్యాడు మణికంఠ. ఎక్కువ కట్నం వస్తుందని ఆశపడ్డాడు. దీంతో తను మోసపోయానని తెలుసుకున్న యువతి పీలేరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రోడ్డుపై బైఠాయించి న్యాయం కావాలంటూ రాస్తారోకో నిర్వహించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments