Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు ధిక్కార కేసులో హైకోర్టుకు హాజరైన నలుగురు ఐఏఎస్‌లు

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:10 IST)
కోర్టు ధిక్కార నేరం కింద ఎపి హైకోర్టుకు నలుగురు ఐఎఎస్ అధికారులు హాజరయ్యారు. వారిలో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీ లక్ష్మి, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఉన్నారు.
 
పాఠశాలల భవనాలలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయం నిర్మాణం పై హై కోర్టులో దిక్కర  కేసు విచారణ జరుగుతోంది. స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ధర్మాసనం  వ్యాఖ్యానించింది.
 
పేద పిల్లలు చదువుకునే స్కూల్‌లో వాతావరణం కలుషితం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీలో ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకున్నారా అని హైకోర్టు జడ్జి దేవానంద్ అధికారులను ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు న్యాయమూర్తి.
 
పాఠశాల ఆవరణ లోకి రాజకీయాలు తీసుకెళ్తారా అని హై కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసారు. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నివేదిక ఇస్తామని ఏజీ కోర్టుకు విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments