Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (14:33 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ట్రక్కు ఒక్కటి గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. సోమవారం వేకువజామున ఈ దారుణం జరిగింది. 
 
అమ్రేలి ఎస్పీ నిర్లిప్త్‌రారు కథనం మేరకు సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో క్రేన్‌ను తరలిస్తుండగా ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. 
 
ఆ సమయంలో గుడిసెలో పదిమంది నిద్రిస్తుండగా వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఎనిమిదిమంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు... ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
మరణించినవారిలో ఇద్దరు వృద్ధులతో పాటు 8-13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments