Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ఏపీ కౌంటర్‌

Advertiesment
AP counter
, శనివారం, 7 ఆగస్టు 2021 (16:09 IST)
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఆక్సిజన్‌ సకాలంలో రాకపోవడం వల్లే రోగులు మృతి చెందారని వెల్లడించింది. ఆక్సిజన్‌ రావడంలో జాప్యంతోనే 23 మంది చనిపోయినట్లు అఫిడవిట్‌ సమర్పించింది. ఆక్సిజన్‌ సరఫరా కంపెనీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు కోర్టుకు తెలిపింది. 
 
గత మే నెలలో తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం నెలకొని కరోనా బాధితులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనితో రుయా ఆసుప‌త్రిలో హాహాకారాలు నెల‌కొన్నాయి. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా పేరొందిన రుయా ఆసుప‌త్రికి కేవ‌లం ఆక్సీజ‌న్ కొర‌త వ‌ల్లే చెడ్డ‌పేరు వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ సంఘ‌ట‌న‌లో మృతి చెందిన కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించింద‌ని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్క్ లేకుండా రైలెక్కిన ప్రయాణికుడు.. అరెస్టు చేసి మెంటల్ ఆస్పత్రికి తరలింపు...