Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఒకేసారి కోర్టుకు ఐదుగురు నిందితులు

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (13:04 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు నిందితులను సీబీఐ ఒకేసారి కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఇది చర్చనీయాంశంగా మారింది. వివేకా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసిన విషయం తెల్సిందే. ఈ విచారణలో భాగంగా, ఐదుగురు నిందితులను హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసు విచారణ ఏపీ నుంచి హైదరాబాద్ నగరానికి బదిలీ అయిన తర్వాత ఐదుగురు నిందితులను ఒకేసారి పిలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
ఇందుకోసం కడప కేంద్ర కారాగారంలో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్ జారీకాగా, బెయిలుపై ఉన్న మరో ఇద్దరికీ సీబీఐ నుంచి సమన్లు అందాయి. కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ఉండగా, బెయిలుపై ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఉన్నారు. వీరు కడప నుంచి ఈ నెల 9వ తేదీన బయలుదేరి పదో తేదీ ఉదయం 10.30 గంటలకు హాజరుకానున్నారు. కడప నుంచి గట్టి భద్రత మధ్య హైదరాబాద్ నగరానికి తరలించాలని సీబీఐ అధికారులు ఏఆర్ పోలీసులను కోరారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments