Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఒకేసారి కోర్టుకు ఐదుగురు నిందితులు

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (13:04 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు నిందితులను సీబీఐ ఒకేసారి కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఇది చర్చనీయాంశంగా మారింది. వివేకా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసిన విషయం తెల్సిందే. ఈ విచారణలో భాగంగా, ఐదుగురు నిందితులను హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసు విచారణ ఏపీ నుంచి హైదరాబాద్ నగరానికి బదిలీ అయిన తర్వాత ఐదుగురు నిందితులను ఒకేసారి పిలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
ఇందుకోసం కడప కేంద్ర కారాగారంలో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్ జారీకాగా, బెయిలుపై ఉన్న మరో ఇద్దరికీ సీబీఐ నుంచి సమన్లు అందాయి. కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ఉండగా, బెయిలుపై ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఉన్నారు. వీరు కడప నుంచి ఈ నెల 9వ తేదీన బయలుదేరి పదో తేదీ ఉదయం 10.30 గంటలకు హాజరుకానున్నారు. కడప నుంచి గట్టి భద్రత మధ్య హైదరాబాద్ నగరానికి తరలించాలని సీబీఐ అధికారులు ఏఆర్ పోలీసులను కోరారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments