Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూవింగ్ ట్రైను ఏసీ బోగీలో మహిళపై టీటీఈ అత్యాచారం...

victim
, సోమవారం, 23 జనవరి 2023 (08:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వేగంగా వెళుతున్న రైలు ఏసీ బోగీలో ట్రావెలింగ్ టిక్కెట్ కలెక్టర్ (టీటీఈ) మరో వ్యక్తితో కలిసి ఓ మహిళా ప్రయాణికురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి టీటీఈని గుర్తించి అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లాలో జరిగింది. 
 
చందౌసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేబీ సింగ్ వెల్లడించిన వివరాల మేరకు.. సుబేదార్ గంజ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం వేచిచూస్తున్న ఓ మహిళ (33)ను చూసిన టీటీఈ ఏసీ బోగీలోని తన సీటులో కూర్చోవాల్సిందిగా కోరాడు. దీంతో ఆ మహిళ ఆ బోగీలో ఎక్కి కూర్చొంది. కొంతసమయం తర్వాత మరో వ్యక్తితో కలిసి అక్కడకు వచ్చిన టీటీఈ.. తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనపై శనివారం బాధితురాలు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు... టీటీఈని రాజు సింగ్‌గా గుర్తించి అరెస్టు చేసినట్టు కేబీసింగ్ వెల్లడించారు. అతనితో కలిసి అత్యాచారానికి పాల్పడిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నిందితుడిపై ఐపీసీ 376డి సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, బాధితురాలు నిందితుడు టీటీఈ రాజు సింగ్‌కు తెలిసిన మహిళ కావడం గమనార్హం. ఈ దారుణం ఈ నెల 16వ తేదీన రాత్రి పది గంటల సమయంలో చందౌనసి అలీఘర్ స్టేషన్ల మధ్య జరిగింది. బాధితురాలు చందౌసి నుంచి ప్రయాగ్ రాజ్ సుబేదార్‌గంజ్‌కు వెళుతుండగా అత్యాచారానికి గురయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లూనార్ ఫెస్టివల్‌లో దుండగుడి కాల్పులు.. పలువురు మృతి