Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ బీచ్ రోడ్డులో జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ లో మంట‌లు

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:44 IST)
జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ పరిధిలో బీచ్ రోడ్డులోని జీఎంఆర్ పవర్ ప్లాంట్‌లో ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఉవ్వెత్తున ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. దీనితో స్థానికులు హాహాకారాలు చేశారు.
 
కాకినాడ బీచ్ రోడ్డులోని ఈ జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ గత 5 సంవత్సరాల నుండి మూతపడి ఉంది. అయితే, ఈ రోజు ఆ పవర్ ప్లాంట్‌లో వెల్డింగ్ చేస్తుండగా, నివ్వు రవ్వలు ఫైబర్ షిట్‌పై పడటంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.

అయినా ద‌ట్టంగా మంట‌లు, న‌ల్ల‌టి పొగ వ్యాపించ‌డంతో స్థానికులు బెంబేలు ప‌డుతున్నారు. మంట‌ల‌ను అదుపు చేసేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అగ్నిమాప‌క సిబ్బంది చెపుతున్నారు. పెద్ద ప్ర‌మాదం ఏమీ ఉండ‌ద‌ని, మంట‌లు అదుపులోకి వ‌చ్చేస్తాయ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments