Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాకినాడ జీఎంఆర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

కాకినాడ జీఎంఆర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
, శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:03 IST)
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జీఎంఆర్ పవర్ ప్లాంట్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా ప్లాంట్‌లో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఈ ప్లాంట్ గత కొన్నేళ్ల క్రితం మూసి వేశారు. 
 
దీంతో ఈ ప్లాంట్‌లో సిబ్బంది ఎవరు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ఈ ప్లాంట్‌లో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు అంటుకుని ప్రమాదం జరిగింది. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అందుపు చేసేందుకు యత్నిస్తున్నారు. పవర్‌ప్లాంట్‌లోని సుమారు 70 శాతం నిర్మాణ సామగ్రి కాలిబూడిదైనట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం: జో బైడెన్