Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాకు ఏనుగుల బెడద

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:15 IST)
చిత్తూరు జిల్లాకు ఏనుగుల బెడద పట్టుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్న ఏనుగులు.. మనంషులపై దాడి చేస్తున్నాయి. పుత్తూరు, వడమాలపేట మండలాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గజరాజులు మంగళవారం నారాయణవనం మండలంలో ప్రవేశించాయి.

ఈ నేపథ్యంలో వీటి దాడులకు ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేకువజామున నారాయణవనం మండలం బొప్పరాజుపాళెం ఎస్టీ కాలనీ ప్రాంతంవైపు ఏనుగుల గుంపు వచ్చింది. అదే సమయంలో బహిర్భూమికి వెళ్లిన స్థానికులు సుబ్బరాయులు, సుబ్రహ్మణ్యంపై ఓ ఏనుగు తొండంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.

108 సిబ్బంది బాధితులను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు రుయాస్పత్రికి రెఫర్‌ చేశారు.

నెలరోజులుగా పుత్తూరు, వడమాలపేట పరిసరప్రాంతాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో గజరాజుల దాడులు పెరగడంతో, అటవీశాఖ అధికారులు సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments