Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లాలో 227 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లాలో 227 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
, ఆదివారం, 27 డిశెంబరు 2020 (07:25 IST)
చిత్తూరు జిల్లా తెలుగు పిచ్చాటూరు సమీపంలోని అప్పంబెడు వద్ద లారీలో రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 227 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్య తెలిపారు.

ఆయన టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న టి ఎన్ 61 ఎఫ్ 5578 లారీని సీజ్ చేసినట్లు తెలిపారు. గత ఐదు రోజులు నుంచి తమకు సమాచారం ఉందని అన్నారు. దీంతో టాస్క్ ఫోర్స్ బృందాలు ఎస్పీ ఆంజనేయులు ఆదేశాలతో ఆర్ ఐ భాస్కర్ నేతృత్వంలో మాటు వేశారని చెప్పారు. 

స్మగ్లర్లు తెలివిగా రవాణా వాయిదా వేస్తూ వచ్చారని తెలిపారు.  అయితే శనివారం తెల్లవారుజామున రవాణా చేస్తుండగా, తమ బృందం లారీని అడ్డుకున్నారని చెప్పారు. లారీ డ్రైవర్ ను పట్టుకోగలిగామని, అతనిని విచారించి, స్మగ్లింగ్ కు అసలు కారకులపై ఆరా తీస్తున్నామని తెలిపారు.

ఊత్తుకోట ప్రాంతాల్లో స్మగ్లర్లు కోసం గాలింపులు చేస్తున్నట్లు చెప్పారు. మరికొన్ని దుంగలు కూడా అడవిలో ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. వీటిని కొంతమంది స్థానిక స్మగ్లర్లు, తమిళులు కలసి సేకరించి నట్లు తేలిసిందన్నారు.

ఈ ఆపరేషన్ లో తిరుపతి టీమ్ లతో పాటు కోడూరు సబ్ కంట్రోల్ టీమ్ లు పాల్గొన్నాయాని అన్నారు. కే సును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఇందులో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు.

ఈ సమావేశంలో సిఐ సుబ్రహ్మణ్యం, ఆర్ ఐ భాస్కర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, ఆర్ ఎస్ ఐ లు వాసు, సురేష్, వెంకట రవికుమార్ (కోడూరు),ఎఫ్ బి ఓ కోదండ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది: దీపక్ రెడ్డి