Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
, గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:37 IST)
చిత్తూరు జిల్లా కుప్పం మండలం పర్తిచేను గ్రామ శివార్లలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి పంటకు కాపలాగా పొలాల్లో నిద్రిస్తున్న కుటుంబంపై ఏనుగులు ఒక్కసారిగా దాడికు తెగబడ్డాయి.

ఈ దాడుల్లో మురుగన్  కుమార్తె ఇంటర్మీడియట్ విద్యార్థి సోనియా  మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో దానికితోడు దట్టమైన అడవుల ఉడటంతో ఏనుగుల దాడులు తరుచు జరుగుతున్నాయి.

కుప్పం పరిసర ప్రాంతాల్లో పంట చేతికొచ్చే సమయానికి ఈ ప్రాంతానికి గుంపులు గుంపులుగా ఏనుగులు పంటలపై దాడులు దిగుతూ భారీ నష్టాలను మిగులుస్తున్నాయి ఈప్రాంత రైతుల్ని.పంట నష్టంతో పాటు ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి.

పంటలు కోతలసమయం వచ్చిందంటే చాలు ప్రాణాలు ఫణంగా పెట్టి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈప్రాంత రైతుది. అయిన పంట నష్టం ప్రాణ నష్టం జరుగుతూనే ఉన్నాయి. ఈ మూలనుంచి వస్తాయో ఎలవస్తాయో తెలియదు గాను భారీగా ఏనుగుల గుంపులు వచ్చి పడుతున్నాయి. 
 
తాజగా తమిళనాడు ప్రాంత అడవుల్లో నుంచి వచ్చిన ఏనుగులు మల్లనూరు ప్రాంతం పర్తిచేను గ్రామంలో తీవ్ర విషాదం నింపాయి..ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ఏనుగుల భారీ నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఒక కుటుంబానికి తీరని అన్యాయం చేసాయి ఏనుగులు.

పంటను తొక్కి తిని నాశనం చేస్తున్న ఏనుగులు అది చాలదన్నట్టు కుటుంభం నిద్రిస్తున్న సమయంలో ఇంటిపై కూడా దాడికి తెగబడ్డాయి ఈదాడి లో ఒక్కరు అక్కడిక్కడే మృతి చెందగా మరొక్కరు తీవ్రగాయలతో బయటపడటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాగుబోతు కొడుకు, సుపారీ ఇచ్చి హత్య చేయించిన తల్లి