Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా రాజకీయ పార్టీయేనా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న!

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (14:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా గుర్తింపుపై ఢిల్లీ హైకోర్టు కీలక ప్రశ్న సంధించింది. అసలు వైకాపా రాజకీయ పార్టీయేనా? అంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అంటూ ప్రశ్న సంధించారు. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై వైకాపా ఢిల్లీ హైకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
ఈ కేసు విచారణ సమయంలో వైకాపా దాఖలు చేసిన అఫిడవిట్‌కు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 29కి వాయిదా వేశారు.
 
ఈ అంశంపై పిటిషనరు బాషా మీడియాతో మాట్లాడుతూ, ట్రేడ్‌ మార్కు చట్టం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్‌ అనే పేరును వాడుకునే హక్కు ఉందని ఆ పార్టీ అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు తెలిపారు. దీంతో వైసీపీ రాజకీయ పార్టీయేనా? అని న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారని చెప్పారు. అఫిడవిట్‌ను మీడియాకు అందించడానికి న్యాయమూర్తి నిరాకరించారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments