Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి ఎస్వీబీసీ చానెల్ ఛైర్మన్‌గా మాడీ ఎమ్మెల్యే యాచేంద్ర

శ్రీవారి ఎస్వీబీసీ చానెల్ ఛైర్మన్‌గా మాడీ ఎమ్మెల్యే యాచేంద్ర
, గురువారం, 29 అక్టోబరు 2020 (09:08 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలు, కైంకర్యాలు, ఆధ్యాత్మిక ప్రచారం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన్ (తితిదే) ఎస్వీబీసీ పేరుతో ఓ భక్తి చానెల్ నడుపుతోంది. ఈ చానెల్ ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే వీబీ సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చుట్టూ అనేక వివాదాలు నెలకొన్న విషయం తెల్సిందే. సినీ నటుడు పృథ్వీని తొలుత ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించారు. కానీ, ఆయన భక్తి సేవలో తరించకుండా మహిళల సేవలో తరించారు. దీనికిని సంబంధించిన ఆడియో ఒకటి లీక్ కావడంతో ఆయన్ను పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది.
 
ఆ తర్వాత అయోధ్య రామమందిరం శంకుస్థాపన కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయకపోవడంతో నలువైపుల నుంచి ఎస్వీబీసీ విమర్శలను ఎదుర్కొంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో వైకాపాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర బాధ్యతలను చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురువారం దత్తాత్రేయ ప్రార్థనతో పితృదోషాలు పరార్