Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునసాగర్ కు తగ్గుతున్న వరద..ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (11:19 IST)
మూడు రోజులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అధికారులు ప్రాజెక్ట్  8 గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 1,54,886 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో  1,54,486 క్యూసెక్కులుగా ఉంది.

అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ  312.0405 ఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 305.5646 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 587.00 అడుగులకు చేరింది. వరద తగ్గుతుండడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 44.0352 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను... ప్రస్తుత నీటి మట్టం 173.882 అడుగులకు చేరింది. 
 
తేలికపాటి వర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని కూడా అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments