Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారితో మానవులకే కాదు.. జీవజాతులన్నింటికీ ముప్పే..!

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (11:18 IST)
కరోనా మహమ్మారితో ముప్పు మానవులకే పరిమితం కాదని అనేక జీవజాతులకు కరోనా ముప్పు పొంచి వుందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తీవ్రస్థాయిలో అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న అనేక వానర జాతులకూ ఈ మహమ్మారితో ప్రమాదం ఉందని తేల్చారు. ఈ మేరకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయ్యింది.
 
మానవుల నుంచి వీటికి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఈ మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. అటు మానవులతోపాటు ఇటు జంతువుల ఆరోగ్యంపైనా దృష్టిసారించాల్సిన ఆవశ్యకతను తమ పరిశోధన వెలుగులోకి తెచ్చిందన్నారు.
 
మానవుల కణాల్లోకి ప్రవేశించడానికి కరోనా వైరస్‌.. ఏసీఈ2 గ్రాహక ప్రొటీన్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వివిధ జీవ జాతుల్లో ఈ ప్రొటీన్‌ నిర్మాణ తీరును పరిశీలించడానికి జన్యు విశ్లేషణను చేపట్టారు. ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లోని పైపూత సహా అనేక కణాలు, కణజాలాల్లో ఈ ప్రొటీన్‌ ఉంటుంది. ఏసీఈ2లో అనేకరకాల అమినో ఆమ్లాలు ఉంటాయి.
 
వీటిలో 25 ఆమ్లాలు కరోనా కారక వైరస్‌ మానవ కణాల్లో ప్రవేశించడానికి వీలు కల్పిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్ని జాతుల్లో ఈ రకాలు ఉన్నాయన్నది దృష్టి సారించారు. ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉన్న జీవజాతుల్లో 40 శాతం జాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments