Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ కేటుగాళ్లున్నారు జాగ్రత్త- పేటీఎం పాపం.. రూ.10 రీచార్జ్ అంటూ లక్ష టోకరా

Webdunia
బుధవారం, 20 మే 2020 (15:32 IST)
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ కూర్చుంటున్న సైబర్ నేరగాళ్లు.. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమవుతూ డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.10 రీచార్జ్ అంటూ.. లక్షలు కొల్లగొట్టిన కేటుగాల్ల బాగోతం బయటపడింది.. రూ.10 రీచార్జ్‌ పేరుతో ప్రభుత్వ టీచర్ పేటీఎం అకౌంట్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
 
పేటీఎం అకౌంట్‌ నుంచి రూ.10 మొబైల్ రీచార్జ్ చేయడంతో.. క్షణాల్లో లక్ష రూపాయలు కాజేశారు. మొబైల్‌కు రావాల్సిన ఓటీపీని సైతం రాకుండా చేసేయడంతో.. ఆ టీచర్‌కు వెంటనే విషయం అర్థం కాలేదు.. ఆలస్యంగా విషయం గ్రహించిన ఎల్బీ నగర్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే, ఫిర్యాదు చేసిన మరుసటి రోజూ మరో బ్యాంకు ఖాతా నుండి మరో లక్ష రూపాయాలకు కొట్టేశారు కేటుగాళ్లు. లాక్‌డౌన్ సమయంలో విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపు కోసం పేటీఎం యాప్‌ను మొబైల్‌లో వేసుకున్నామని.. కానీ, ఇంటి లోన్ కోసం దాచుకున్న సొమ్మును కాజేశారంటూ లబోదిబోమంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments