Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ కేటుగాళ్లున్నారు జాగ్రత్త- పేటీఎం పాపం.. రూ.10 రీచార్జ్ అంటూ లక్ష టోకరా

Webdunia
బుధవారం, 20 మే 2020 (15:32 IST)
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ కూర్చుంటున్న సైబర్ నేరగాళ్లు.. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమవుతూ డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.10 రీచార్జ్ అంటూ.. లక్షలు కొల్లగొట్టిన కేటుగాల్ల బాగోతం బయటపడింది.. రూ.10 రీచార్జ్‌ పేరుతో ప్రభుత్వ టీచర్ పేటీఎం అకౌంట్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
 
పేటీఎం అకౌంట్‌ నుంచి రూ.10 మొబైల్ రీచార్జ్ చేయడంతో.. క్షణాల్లో లక్ష రూపాయలు కాజేశారు. మొబైల్‌కు రావాల్సిన ఓటీపీని సైతం రాకుండా చేసేయడంతో.. ఆ టీచర్‌కు వెంటనే విషయం అర్థం కాలేదు.. ఆలస్యంగా విషయం గ్రహించిన ఎల్బీ నగర్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే, ఫిర్యాదు చేసిన మరుసటి రోజూ మరో బ్యాంకు ఖాతా నుండి మరో లక్ష రూపాయాలకు కొట్టేశారు కేటుగాళ్లు. లాక్‌డౌన్ సమయంలో విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపు కోసం పేటీఎం యాప్‌ను మొబైల్‌లో వేసుకున్నామని.. కానీ, ఇంటి లోన్ కోసం దాచుకున్న సొమ్మును కాజేశారంటూ లబోదిబోమంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments