Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో 2 వేలు దాటిన కరోనా కేసులు - చిత్తూరును దెబ్బతీసిన కోయంబేడు

Webdunia
సోమవారం, 11 మే 2020 (13:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎట్టకేలకు రెండు వేలుదాటిపోయాయి. గత 24 గంటల్లో మరో 38 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2018కు చేరుకుంది. 
 
ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురంలో 8, చిత్తూరులో 9, గుంటూరులో 5 కేసులు నమోదయినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. 
 
కృష్ణాలో 3, నెల్లూరులో 1 , కర్నూలులో 9, విశాఖపట్నంలో 3 కేసులు నమోదయ్యాయని వివరించింది. అయితే, చిత్తూరులో నమోదైన 9 కేసుల్లో ఎనిమిది కేసులకు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌తో లింకు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు.
 
ఇకపోతే, జిల్లా వారీగా కేసులను పరిశీలిస్తే, అనంతపూర్ 115, చిత్తూరు 121, గుంటూరు 387, కడప 97, కృష్ణ 342, కర్నూలు 575, నెల్లూరు 102, ప్రకాశం 63, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 66, విజయనగరం 4, వెస్ట్ గోదావరి 68, ఇతరులు 27 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ 27 కేసుల్లో 27 మంది గుజరాత్, ఒకరు కర్నాటకకు చెందిన వలస కూలీలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments