నాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటానంటున్న ఎపి మంత్రి

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (23:20 IST)
అసలే విపత్కరమైన పరిస్థితి. ప్రజలు కరోనా వైరస్ అంటేనే భయపడిపోతున్నారు. దీన్నే కొంతమంది ఆసరాగా చేసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులను బ్లాక్ లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలు, కూరగాయలు, మిగిలిన నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. 
 
ఎపిలోని కొన్ని జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎవరైనా సరే అధిక ధరలకు షాపుల యజమానులు విక్రయించినట్లు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తాం. షాపుల యజమానులు జాగ్రత్తగా ఉండండని హెచ్చరించారు ఎపి వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని.
 
తిరుపతిలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమిష్టిగా పనిచేస్తున్న తీరు ప్రసంశనీయమన్నారాయన. 
 
ఇప్పటి వరకు 23పాజిటివ్ కేసులు మాత్రమే ఎపిలో నమోదయ్యాయని..వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు మంత్రి. ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దని, వైరస్ వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఎవరైనా ఎక్కడైనా నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్మితే తనకు ఫోన్ చేయాలని కోరారు. తన నెంబర్ గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తుందని..ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments