Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారాలు నమ్మకండి, పెద్దజియ్యర్ స్వామి

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (23:11 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో అఖండ దీపం ఆగిపోయింది.. సరిగ్గా నైవేద్యాలు పెట్టడం లేదు. ఆలయంలో ఎన్నో రకాల అపచారాలు జరుగుతున్నాయని రకరకాల ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు. కొంతమంది స్వార్థపరులు కావాలనే పనిగట్టుకుని ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరూ ఆందోళనకు గురికావద్దు.
 
ఆలయంలో ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి వరకు ఏకాంత సేవలన్నీ సరిగ్గానే నిర్వహిస్తున్నాము. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేవు. అఖండ దీపాన్ని కూడా చిన్నదిగా చేశాము కానీ.. దీపం 24 గంటల పాటు వెలుగుతోంది. కైంకర్యాలన్నీ సక్రమంగా కొనసాగుతున్నాయి అంటూ తిరుమల పెద్దజియ్యంగార్ స్పష్టం చేశారు. 
 
స్వయంగా పెద్దజియ్యంగార్ టిటిడి ఈఓకు ఒక లేఖ కూడా రాశారు. ఆలయంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని..ప్రజా సంబంధాల అధికారి ద్వారా మీడియా ప్రకటన చేయాలని కూడా నిన్ననే పెద్దజియ్యంగార్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న హడావిడిగా పిఆర్ ఓ విభాగం మీడియాకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మీడియా ముందు ఎప్పుడూ రాని పెద్దజియ్యంగార్ ఈరోజు మధ్యాహ్నం తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి తిరుమలపై  జరుగుతున్న దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments