Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వచ్చిందంటే.. పకోడీ షాపు యజమాని ఏం చేశాడో తెలుసా..?

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (11:41 IST)
ఓ  పకోడి షాపు యజమానికి కరోనా సోకింది. అంతటితో ఆ పకోడీ షాపు యజమాని ఆస్పత్రిల చేరాడా అంటే లేదు. వివరాల్లోకి వెళితే.. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పాత జాతీయ రహదారిలో ఉన్న ఓ పకోడి షాపు యజమాని కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్‌ రావడంతో మెడికల్‌ సిబ్బంది ఫోన్‌ చేసి విషయం చెప్పారు. అంతేగాకుండా అతనిని ఆస్పత్రికి తరలించేందుకు వచ్చారు. 
 
అయితే ఆ షాపు యజమాని మాత్రం పకోడీకి పిండి రుబ్బేశాను. కాస్త ఆగండి వచ్చేస్తానంటూ సమాధానమిచ్చారు. దీంతో సిబ్బంది షాకయ్యారు. బాధితుడి మాటలు విన్న మెడికల్‌ సిబ్బందికి ఓ క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే తేరుకుని ఆయనకు చీవాట్లు పెట్టి బలవంతంగా 108లోకి ఎక్కించారు. ఆయన కుటుంబసభ్యులను కూడా తీసుకొచ్చి పరీక్షలు చేయించాలని, అనంతరం కుటుంబం అంతా హోంక్వారెంటైన్‌లో ఉండాలని సూచించారు. 
 
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అంటే ప్రజలకు ఇప్పుడు ఏమాత్రం భయం లేకుండా పోయింది. ఆ అదే వస్తుంది, పోతుందిలే అని ఆ మహమ్మారి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. గత ఏడాది ఫస్ట్ వేవ్ సందర్భంగా పాజిటివ్ వచ్చిందని తెలియగానే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్న వాళ్లే.. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కరోనా గురించి కామెడీలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments