Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరంగల్‌లో కరోనా కేసులు.. టీకా తీసుకున్నా కోవిడ్ వదలట్లేదు..

Advertiesment
Warangal
, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (10:21 IST)
కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా ముప్పు తప్పలేదు. ఈ కేసులు ఎక్కువగా వరంగల్‌లో ఇటీవల వెలుగుచూస్తున్నాయి. వరంగల్‌ సీకేఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు రెండు విడతలు టీకా తీసుకున్నా మళ్లీ కరోనా బారిన పడ్డారు. కీర్తినగర్‌ యూపీ హెచ్‌సీల్‌లో నాలుగు రోజుల కిందట 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 
 
అందులో రెండోవిడత టీకా తీసుకున్న ఏడుగురికి కోవిడ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది. మరో ట్వీస్ట్ ఏమిటంటే టీకా తీసుకున్నవారికి కోవిడ్‌ పాజిటివ్‌ వస్తే అధికారులు పాజిటివ్‌ రిపోర్టు చేతికి ఇవ్వడం లేదు. చరవాణికి సంక్షిప్త సందేశాన్నీ పంపడం లేదు. 
 
ఆరా తీస్తే వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి పాజిటివ్‌ వస్తే పోర్టల్‌లో తీసుకోవడం లేదని సిబ్బంది అంటున్నట్లు బాధితులు తెలిపారు. పాజిటివ్‌ రిపోర్టు ఇస్తేనే అధికారులు సెలవు మంజూరు చేస్తామంటున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. 
 
దీనిపై వరంగల్‌ అర్బన్‌ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి మాట్లాడుతూ.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నా జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు. టీకా వేయించుకుంటే వంద శాతం వైరస్‌ సోకదని చెప్పలేమన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగ్గురు మహిళా పోలీసులు... మూడు తప్పులు.. ఏంటవి?