విజయవాడలో ఐదుగురు జర్నలిస్టులకు కరోనా లక్షణాలు!

Webdunia
శనివారం, 2 మే 2020 (16:01 IST)
విధి నిర్వహణలో అలుపెరగని పోరాటం చేస్తూ కోవిడ్ వార్తలను కవర్ చేస్తున్న ఐదుగురు మీడియా ప్రతినిధుల్లో కరోనా వ్యాధి లక్షణాలు వెలుగు చూసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.

విజయవాడ నగరంలో ఐఎంఏ, ఏపీయూడబ్ల్యుజె సంయుక్తంగా ఇటీవల జర్నలిస్టులకు ఉచిత కరోనా స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించాయి. ఈ క్యాంపునకు విజయవాడలో పనిచేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు చేయించుకున్నారు.

సుశిక్షితులైన వైద్య సిబ్బంది వీరినుంచి నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్ కు పంపించడం జరిగింది. టెస్ట్ నివేదికల్లో ఇందులో ఐదుగురికి కరోనా లక్షణాలు కానవచ్చాయని ఐఎంఏ నగర కార్యదర్శి డాక్టర్ తుమ్మల కార్తీక్ చెబుతున్నారు.

అయితే కరోనా లక్షణాలు కనిపించిన వారికి  మరొక పూర్తిస్థాయి పరీక్ష నిర్వహిస్తే కానీ.. పాజిటివ్ కేసులుగా నిర్ధారించలేమని స్పష్టం చేశారు. అనుమానితుల్లో ప్రముఖ టీవీ ఛానళ్ళ ప్రతినిధులు వున్నారని డాక్టర్ కార్తీక్ వెల్లడించారు.

ఇప్పటికే వారికి సమాచారం అందించడం జరుగుతోందన్నారు. ఒకవేళ వారిలో  కరోనా పాజిటివ్ లుగా తేలితే వారిని ప్రత్యేక చికిత్స కు తరలించడం జరుగుతుందన్నారు.

మీడియా మిత్రులెవరూ ఈ విషయంపై భయపడాల్సిన అవసరం లేదని, విజయవాడ లో కోవిడ్ రోగులకోసం అద్భుతమైన చికిత్స లభిస్తోందని డాక్టర్ తుమ్మల కార్తీక్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments