Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు శిక్ష

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:51 IST)
కోర్టు ధిక్కార కేసులో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనరు గిరిజా శంకర్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనరు చిరంజీవి చౌదరికి తొమ్మిది రోజుల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వారిద్దరూ బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో జైలుశిక్ష తీర్పును సవరించి జరిమానా విధించింది. దీనిని మూడు రోజుల్లో చెల్లించకపోతే జైలుశిక్ష అమలవుతుందని స్పష్టం చేసింది. హైకోర్టు పనివేళలు ముగిసే వరకూ కోర్టులోనే నిలబడి ఉండాలని ఆదేశిస్తూ... న్యాయమూర్తి జస్టిస్‌ బి.దేవానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్‌ను ఆ తర్వాత సవరించింది. దీనిని కృష్ణతోపాటు 35 మంది సవాల్‌చేస్తే సవరణ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం ఇవ్వాలని ఆదేశాలు అమలు కాకపోవడంతో వారంతా కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు.

ఈ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం హైకోర్టులో హాజరయ్యారు. అఫిడవిట్‌ దాఖలుకు సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments