Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతు ఉద్యమానికి రాహుల్ మ‌ద్ద‌తు... త్వ‌ర‌లో గుంటూరుకు రాక

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (14:57 IST)
వైఎస్ కుటుంబంపై మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డిని సీఎం చేయడంతోనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. వైఎస్ సీఎం కాకపోతే...నేడు జగన్ సీఎం కాలేరన్నారు. వైసీపీ వలన కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరిగిందని, ఇపుడు రాజ‌కీయంగా తేరుకోలేని స్థితిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లిపోయింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
ఇక ఏపీలో అమ‌రావ‌తి ఉద్య‌మానికి కాంగ్రెస్ బాస‌ట‌గా నిలుస్తుంద‌ని, త్వ‌ర‌లో కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌స్తార‌ని చింతా మోహ‌న్ తెలిపారు. విశాఖ, గుంటూరుకు త్వరలోనే రాహుల్ గాంధీ వస్తారని, స్టీల్ ప్లాంట్, అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతారన్నారు. మూడు రాజధానులపై జగన్ ది తొందర పాటు చర్య అని, అఖిలపక్ష సమావేశం నిర్ణయం తీసుకోవాల్సిందని అన్నారు. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని చింతా మోహ‌న్ స్పష్టం చేశారు. త్వరలో ఏపీ పీసీసీలో మార్పులు ఉంటాయని, అయితే తాను పీసీసీ అధ్యక్ష రేసులో లేనని చింతా మోహన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments