Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనసు మార్చుకున్న సీఎం జగన్ - ఆ పది మందికి మళ్లీ ఛాన్స్

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (12:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తుంది. తన మంత్రివర్గం సహచరులతో మూకుమ్మడి రాజీనామాలు చేయించిన ఆయన ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీరిలో నలుగురు మినహా మిగిలిన వారందరికీ కొత్త వారికి అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం జరిగింది. 
 
అయితే, సీఎం జగన్ ఒక్క రోజు రాత్రికే మనస్సు మార్చుకున్నారు. రాజీనామా చేయించిన 24 మంది మంత్రుల్లో పది మందికి మళ్లీ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా పాత మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులను మాత్రం కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటి వారిలో పది మందిని మళ్లీ మంత్రులను చేయొచ్చని తెలుస్తుంది. 
 
పాత మంత్రులను కొనసాగించే పరిస్థితి ఏర్పడిన పక్షంలో సీనియర్లు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, తానేటి వనితలకు మళ్లీ మంత్రులుగా అవకాశం కల్పించవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల్లో కొత్త మంత్రివర్గ కూర్పుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments