Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రమేష్ కొత్తగా లగ్జరీ ఫ్లైట్ కొనుగోలు చేశారా?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (09:58 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇపుడు ఓ లగ్జరీ విమానాన్ని కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పైగా, కడప ఎయిర్‌పోర్టులో ఈ విమానికి ప్రత్యేక పూజలను కూడా ఆయన చేశారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, రాజకీయ పరమైన విమర్శలు కూడా వినిపించాయి.
 
దీంతో సీఎం రమేశ్ ప్రతినిధులు స్పందించారు. ఆ విమానం సీఎం రమేశ్‌కు చెందినది అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. ఆ విమానాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దానికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో సీఎం రమేశ్ ను కూడా ఆహ్వానించారని వెల్లడించారు. 
 
విమాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన సీఎం రమేశ్ సంప్రదాయాలను అనుసరించి కొబ్బరికాయ కొట్టారే తప్ప, విమానం ఆయనది కాదని ఓ ప్రకటనలో వివరించారు. సీఎం రమేశ్ ఆర్థికంగా బాగా బలమైన వ్యక్తి కావడంతో ఆయన సొంతంగా చిన్న విమానం కొనుగోలు చేశారంటూ కథనాలు వచ్చాయి. 
 
కాగా, సీఎం రమేశ్ సన్నిహితుడు ఒకరు కొత్తగా లగ్జరీ విమానాన్ని కొనుగోలు చేయగా, ఆ విమానానికి సీఎం రమేశ్ కడప ఎయిర్ పోర్టులో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రమేష్ కూడా హాజరై, లాంఛనంగా కొబ్బరికాయ కొట్టారు. ఆపై విమానంలోకి ప్రవేశించారు. దీంత ఈ విమానం సీఎం రమేశ్ దేనంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments