Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ వెళ్లేందుకు ముహూర్తం ఖరారు : ఏపీ సీఎం జగన్ వెల్లడి

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేశామని, అక్కడ నుంచి పాలన సాగించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వచ్చే జూలై నుంచి విశాఖపట్టణం నుంచి పాలన సాగుతుందని చెప్పారు. 
 
ఆయన అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, జూలై నెలలో విశాఖకు తరలి వెళుతున్నామన్నారు. విశాఖ నుంచే పాలన ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైకాపానే గెలవాలని స్పష్టం చేశారు. మీ పనితీరును గమనిస్తున్నాను.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మనవాళ్లను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ మంత్రివర్గ సహచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
కాగా, విశాఖ నుంచి పాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ ఇటీవల సీఎం జగన్ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. పైగా, ఇటీవల వైజాగ్ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ ప్రకటించిన విషయం తెల్సిందే. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం జగన్ తమ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టుగా తాజాగా క్యాబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments