Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ వెళ్లేందుకు ముహూర్తం ఖరారు : ఏపీ సీఎం జగన్ వెల్లడి

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేశామని, అక్కడ నుంచి పాలన సాగించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వచ్చే జూలై నుంచి విశాఖపట్టణం నుంచి పాలన సాగుతుందని చెప్పారు. 
 
ఆయన అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, జూలై నెలలో విశాఖకు తరలి వెళుతున్నామన్నారు. విశాఖ నుంచే పాలన ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైకాపానే గెలవాలని స్పష్టం చేశారు. మీ పనితీరును గమనిస్తున్నాను.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మనవాళ్లను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ మంత్రివర్గ సహచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
కాగా, విశాఖ నుంచి పాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ ఇటీవల సీఎం జగన్ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. పైగా, ఇటీవల వైజాగ్ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ ప్రకటించిన విషయం తెల్సిందే. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం జగన్ తమ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టుగా తాజాగా క్యాబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments