Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (09:37 IST)
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జూబ్లీహిల్స్‌ సొసైటీ నుంచి 595 చదరపు గజాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఇక్కడ నిర్మాణాలు చేసేందుకు ఆయన భూమి పూజా కూడా చేశారు. అయితే, ఆ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిందనీ, అందువల్ల అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. వీటిని విచారణకు స్వీకరించిన కోర్టు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
 
ప్రజా ఉపయోగం కోసం ఉద్దేశించిన 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి విక్రయించిందంటూ జె.శ్రీకాంత్ బాబు, మరికొందరు కలిసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ భూమిపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి నియంత్రణ లేకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించి సొసైటీ దానిని చిరంజీవికి విక్రయించిందని పిటిషనర్లు ఆరోపించారు. 
 
కొనుగోలు చేసిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ), జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments