Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్లీజ్... సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వండి... కోర్టుకు అవినాశ్ రెడ్డి

avinash reddy
, శుక్రవారం, 10 మార్చి 2023 (08:33 IST)
వైకాపా నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుకు కళ్లెం వేయాలంటూ ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైకాపా నేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుసకు తమ్ముడు అయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ తన పట్ల అరెస్టు వంటి తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. 
 
వివేకా హత్య కేసులో మరోమారు విచారణకు రావాలంటూ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఆరో తేదీన హైదరాబాద్ నగరంలోని తమ సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ఆ రోజున వేరే కార్యక్రమాలు ఉన్నాయని, అందువల్ల హాజరుకాలేనని బదులిచ్చారు. దీంతో 10వ తేదీన రావాలంటూ మరోమారు నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం సీబీఐ విచారణకు హాజరుకావాల్సివుది. 
 
ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు న్యాయవాదిని కూడా అనుమతించాలని, విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డ్ చేసేలా సీబీఐని అదేశించాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐ దూకుడుకు కళ్లెం వేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం కాపీని ఇచ్చేలా ఆదేశించాలని కూడా అవినాశ్ రెడ్డి తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవీన్ హత్య కేసు.. నిహారిక విస్తుపోయే నిజాలు.. చెప్పినట్టే చేసేశాడు.