Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టీల్ ప్లాంట్‌తో జిల్లా రూపు రేఖలు మారిపోతాయ్ : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

jagan
, బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (14:02 IST)
కడప జిల్లా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ జిల్లా ప్రజల చిరాకల స్వప్నం నెరవేర్చేందుకు ఈ రోజు శ్రీకారం చుట్టామన్నారు. జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేసినట్టు చెప్పారు. 
 
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని, యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాలని తన తండ్రి దివంగత వైఎస్ఆర్ కలలుకన్నారన్నారు. ఆయన మరణాంతరం ఈ ప్రాంతాన్ని ఏ ఒక్క పాలకుడూ పట్టించుకోలేదన్నారు. ఇపుడు వైఎస్ఆర్ బిడ్డగా మీ బిడ్డ అయిన తాను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంతానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు. 
 
వైఎస్ఆర్ కలలను సాకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురునిలిచి, ఇపుడు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు. వచ్చే 24 లేదా 30 నెలల్లో ఈ ప్లాంట్ తొలి నిర్మాణం పూర్తవుతుందన్నారు. ప్లాంట్ మొదలైన అనుబంధ పరిశ్రమలు జిల్లాకు తరలివస్తాయని, జిల్లా అభివృద్దిలో ఇకపై దూసుకుని పోతుందన్నారు. ప్రారంభంలో ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం 3 మిలియన్ టన్నులుగా ఉందని, భవిష్యత్‌లో ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 13 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని సీఎం జగన్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బావిలో పడిన చిరుతపులి... చిన్నపిల్లి.. వీడియో వైరల్