Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతం రెడ్డి భౌతికయాన్ని చూసి సీఎం జగన్ భావోద్వేగం - సతీమణితో కన్నీటి నివాళి

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (16:25 IST)
ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి కన్నీటి నివాళులు అర్పించారు. ముఖ్యగా, తన సహచరుడు, కేబినెట్ మంత్రి గౌతం రెడ్డి భౌతికకాయాన్ని చూడగానే సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే, సీఎం జగన్‌ను చూడగానే మేకపాటి గౌతం రెడ్డి కుటుంబం బోరున విలపించింది. 
 
ఏపీ మంత్రి గౌతం రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. ఈ మరణ వార్త తెలియగానే ఆయన ప్రత్యేక విమానంలో బెంగుళూరుకు చేరుకున్నారు. అక్కడ తన భార్యను వెంటబెట్టుకుని హైదరాబాద్ నగరానికి చేరుకుని, జూబ్లీహిల్స్‌లోని మేకపాటి గౌతం రెడ్డి నివాసానికి చేరుకుని కన్నీటి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అక్కడి మేకపాటి కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరినీ కలిచివేశాయి. 
 
సీఎం జగన్‌ను చూడగానే గౌతం రెడ్డి తల్లి బోరున విలపించారు. గౌతం రెడ్డి సతీమణి, ఆయన తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. తనను చూసిన గౌతం రెడ్డి కుటుంబ సభ్యులు బోరున విలపించడాన్ని  చూసిన జగన్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. గౌతం పార్ధివదేహం పక్కనే కుర్చీలో కూర్చొన్న జగన్ కన్నీరుకార్చారు. అలాగే, తన పక్కనే కూర్చొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని సీఎం జగన్ ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments