Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి గౌతం రెడ్డి మరణం వైకాపాకు తీరని లోటు : ఎమ్మెల్యే రోజా

మంత్రి గౌతం రెడ్డి మరణం వైకాపాకు తీరని లోటు : ఎమ్మెల్యే రోజా
, సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:57 IST)
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మృతి వైకాపాకు తీరని లోటని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సినీ నటి ఆర్.కె.రోజా అన్నారు. సోమవారం గౌతం రెడ్డికి తీవ్రమైన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆయన మృతిపట్ల ఆర్.కె.రోజా స్పందించారు. గౌతం రెడ్డి ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిసివేసిందన్నారు. గౌతం రెడ్డి తనకు సోదరుడు వంటివారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. 
 
ఉన్నత విద్యను అభ్యసించిన గౌతం రెడ్డి.. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే స్వభావం కలిగిన వారని చెప్పారు. ఆయన మరణం వైకాపాకు తీరని లోటని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గౌతం రెడ్డిలు మంచి స్నేహితులని గుర్తుచేశారు.
 
కాగా, కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది గుండెపోటుకుగురై మృత్యువాతపడుతున్నారని చెప్పారు. గౌతంరెడ్డితో చివరిసారిగా 20 రోజుల క్రితం తాను మాట్లాడినట్టు చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఆమె చెప్పారు. 

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేకపాటి గౌతంరెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు