Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి గుండెపోటు - హఠాన్మరణం

ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి గుండెపోటు - హఠాన్మరణం
, సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (09:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన హఠాన్మరణం చెందారు. 
 
ఆయన సోమవారం ఉదంయ గుండెపోటుకు గురికాగానే ఆయనను హుటాహుటిన హైదరాబాద్ నగరానికి తరలించి అత్యవసర సేవల విభాగంలో వైద్యులు వైద్యం చేశారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. 
 
కాగా, నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే సెగ్మెంట్‌ నుంచి 2014లోనూ గెలుపొందారు. మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి జగన్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవలే దుబాయి పర్యటనకు వెళ్లి వచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో గ్రేప్ ఫెస్టివల్ - తిన్నోళ్లకు తిన్నంత ద్రాక్ష