Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో మరో అల్పపీడనం.. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (12:11 IST)
భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

అయితే దీని ప్రభావం దక్షిణ తమిళనాడుతో పాటు శ్రీలంక దేశంపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 
 
అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా గాలులు గంటకు 12 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నాయని అధికారులు తెలిపారు.

దక్షిణ అండమాన్‌ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగనుంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆకాశంలో పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments