Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

శింబు కంట‌త‌డి - ఓదార్చిన స్నేహితులు ఎందుకో తెలుసా!

Advertiesment
Shimbu
, శుక్రవారం, 19 నవంబరు 2021 (10:20 IST)
Simbu- maa naadu
త‌మిళ‌నాడులో స్టార్‌గా ఎదిగిన శింబు రానురాను వివాదాలకు గుర‌వుతున్నారు. తాజాగా ఆయ‌న న‌టించిన యాక్షన్ డ్రామా ‘మానాడు’. గురువారం నాడు చెన్నైలో ప్రీరిలీజ్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వేదిక‌పై హాజ‌రైన ప్ర‌ముఖులు చిత్రం గురించి మాట్లాడారు. ఆ త‌ర్వాత శింబు మాట్లాడుతూ, ఒక్క‌సారిగా భావోద్వేగానికి లోనవుతూ, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయ‌న మాట్లాడిన అనంత‌రం కుర్చీలో కూర్చోగానే అదే మూడ్‌లో వుండ‌డం చూసిన  చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, శింబు స్నేహితుడు, నటుడు మహత్ వేదికపై శింబును ఓదార్చారు. 
 
ఒక్క‌సారిగా జ‌రిగిన ఈ ప‌రిణామం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేసింది. దీనికి కార‌ణం కూడా శింబు పేర్కొన్నారు. ప‌రిశ్ర‌మ‌లోని కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ అంటూ వారి పేర్ల చెప్ప‌కుండానే ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
 “నేను చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను. కానీ వాటన్నింటినీ నేను చూసుకుంటాను. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ శింబు తన అభిమానులను కోరాడు. ఇది ఈ వేడుక‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వ్య‌క్తిగ‌తంగా, న‌ట‌నాప‌రంగా శింబు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

అప్పుడెప్పుడో న‌య‌న‌తార ఇష్యూ నుంచి ఆ త‌ర్వాత షూటింగ్‌ల‌కు గైర్హాజ‌రు కావ‌డం వ‌ర‌కూ ఆయ‌న‌పై తమిళ నిర్మాతల మండలి రెడ్ కార్డ్ కూడా జారీ చేసింది. ఆ త‌ర్వాత ప్ర‌స్తుతం సినిమా `మానాడు` కూడా ఆల‌స్య‌మైంది. దానికి శింబు కార‌ణ‌మ‌ని నిర్మాత సురేష్ కామచ్చి ఫిర్యాదు చేశారు. ఫైన‌ల్‌గా ప‌రిష్క‌రించి శింబు సినిమా విడుద‌ల‌కు తీసుకువ‌చ్చాడు. ఈ సినిమా ఈనెల 25న విడుద‌ల‌కాబోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇబ్బందులు పెడుతున్నారంటూ కన్నీరు పెట్టుకున్న హీరో శింబు