Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు

Webdunia
బుధవారం, 4 మే 2022 (13:23 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. "జనం బాట" పేరుతో జరిగే ఈ పర్యటనలో ఏపీలోని వైకాపా ప్రభుత్వ పాలన తీరును ఆయన ఎండగట్టనున్నారు. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా, గురువారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో పర్యటిస్తారు. 
 
ఈ నెల 5వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని తాళ్లవలస, 6వ తేదీన ముమ్మడివరం నియోజకవర్గంలోని కోరింగ గ్రామంలో జరిగే "బాదుడే బాదుడు" కార్యక్రమంలో ఆయన పాల్గొని వైకాపా ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించనున్నారు. బాబు పర్యటన కోసం టీడీపీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 
 
వైకాపా ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తు ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఆయన ప్రజలకు వివరించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత గ్రామంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments