Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు

Webdunia
బుధవారం, 4 మే 2022 (13:23 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. "జనం బాట" పేరుతో జరిగే ఈ పర్యటనలో ఏపీలోని వైకాపా ప్రభుత్వ పాలన తీరును ఆయన ఎండగట్టనున్నారు. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా, గురువారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో పర్యటిస్తారు. 
 
ఈ నెల 5వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని తాళ్లవలస, 6వ తేదీన ముమ్మడివరం నియోజకవర్గంలోని కోరింగ గ్రామంలో జరిగే "బాదుడే బాదుడు" కార్యక్రమంలో ఆయన పాల్గొని వైకాపా ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించనున్నారు. బాబు పర్యటన కోసం టీడీపీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 
 
వైకాపా ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తు ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఆయన ప్రజలకు వివరించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత గ్రామంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments