Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హస్తినకు వెళ్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (08:31 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీకి వెళుతున్నారు. జీ-20 సదస్సు వ్యూహాలు ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తిన పర్యటనకు వెళుతున్నారు. సోమవారం ఉదయం 8.45 గంటలకు ఇంటి నుంచి ఆయన బయలుదేరుతారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానంలో వెళ్లి మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకుంటారు. 
 
ఢిల్లీకి చేరిన తర్వాత 50 అశోక రోడ్డులోని నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌ కల్చలర్ హాలులో జరిగే ఆల్ పార్టీ మీటింగ్‌కు హాజరవుతారు. రాత్రి 7 గంటలకు తిరిగి అశోక రోడ్డులో ఉన్న నివాసానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు.
 
అలాగే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళుతున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీతో ఆయనకున్న వైరం కారణంగా ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments